హైదరాబాద్: నిన్న కోర్టు చర్చలకు వెళ్లాలని ఆర్టీసీ సంఘాలను, చర్చలకు పిలవాలని ప్రభుత్వాన్ని ఆదేశించగా ఆర్టీసీ జేఏసీ చర్చలకు సిద్ధమని ప్రకటించింది. అయితే ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పిన ఆర్టీసీ సంఘాలు సమ్మె కొనసాగుతుందన్నారు. ప్రజా రవాణాను కాపాడుకునేందుకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సమ్మెతో ఉత్పన్నమయ్యే ఎలాంటి పరిణామాలకైనా ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ప్రజా రావాణ వ్యవస్థను కాపాడటానికి పోరాటం జరుగుతుందని, ఈ పోరాటంలో ఆర్టీసీ కార్మికులతో పాటు తెలంగాణ పౌర సమాజం మొత్తం తమ వెన్నంటే ఉంటూ ప్రత్యక్షంగా పాల్గొంటుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm