న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య బుధవారంనాడు కలుసుకున్నారు. మర్యాదపూర్వకంగా సోనియాను ఆయన కలుసుకున్నట్టు తెలుస్తోంది. సుమారు 20 నిమిషాల పాటు ఉభయులూ సమావేశమయ్యారు. కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ విపక్ష నేతగా ఎన్నికైన తర్వాత సోనియాగాంధీని ఆయన కలుసుకోవడం ఇదే ప్రథమం. ఈనెల 9న సిద్ధరామయ్యను కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేతగా, ఎస్ఆర్ పాటిల్ను శాసనమండలి విపక్ష నేతగా సోనియాగాంధీ నియమించారు. 2013 నుంచి 2018 వరకూ సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm