హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళిక, అభివృద్ధిలో సమగ్ర కార్యాచరణను రూపొందించేందుకు సేజిస్ అనే సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఓ అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సమక్షంలో ఎంవోయూ పత్రాలను అధికారులు అందుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఈ ఎంవోయూ ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయ పడ్డారు.
ట్రాన్స్ఫార్మింగ్ స్టేట్ ఎఫెక్టివ్ నెస్ ఇన్ తెలంగాణ్ణ అనే అంశంపై నీతీఆయోగ్ సలహాదారుడు మురళీధరన్ కార్తికేయన్, ప్రభుత్వ ఆర్థిక సలహాదారులు జీఆర్.రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు. అర్థ గణాంక శాఖ డైరెక్టర్ సుదర్శన్ రెడ్డి, ప్లానింగ్ శాఖ డైరెక్టర్ షేక్ మీరా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 05:52PM