హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి తను నటించిన 'సైరా' మూవీ ప్రమోషన్స్ను భారీగా చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిలను 'సైరా' మూవీ చూడాల్సిందిగా చిరంజీవి కోరిన విషయం తెలిసిందే. బుధవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కలిసిన చిరంజీవి, ఆయన నివాసంలోనే ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు కుటుంబ సభ్యులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm