అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్, టేబుల్ టాపర్ దబాంగ్ ఢిల్లీ మధ్య బుధవారం తొలి సెమీ ఫైనల్ జరుగనుంది. మరో సెమీస్లో బెంగాల్ వారియర్స్, యూ ముంబా ముఖాముఖి తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో యూపీ యోధాపై అద్భుత విజయంతో సెమీస్లోకి ప్రవేశించిన బెంగళూరు.. అదే జోరులో ఢిల్లీని మట్టికరిపించాలని చూస్తున్నది. సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్లలో ఫైనల్ బెర్తు దక్కించుకునేది ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వరుస విజయాలతో జోరు మీదున్న యూ ముంబా.. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్న బెంగాల్ వారియర్స్ను ఎదుర్కోబోతున్నది.
బెంగళూరు x ఢిల్లీ(రాత్రి 7.30 నుంచి)
బెంగాల్ x ముంబా(రాత్రి 8.30 నుంచి)
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 07:06PM