హైదరాబాద్: కాంగ్రెస్ నేత మర్రి శశిధర్రెడ్డి బుధవారం ఎన్నికల అధికారి రజత్కుమార్ను కలిశారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం హుజూర్నగర్లో జరగనున్న సీఎం కేసీఆర్ సభ కోసం టీఆర్ఎస్ భారీగా ఖర్చు చేస్తోందన్నారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన మీడియాలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటనలు వస్తున్నాయని, ఈ ఖర్చును టీఆర్ఎస్ అభ్యర్థి ఖర్చుగానే చూడాలని ఈసీని కోరినట్లు చెప్పారు. హుజూర్నగర్లో మంత్రుల ఆత్మీయ సమ్మేళనాలు కోడ్ ఉల్లంఘనేనని..కోడ్ ఉల్లంఘించిన మంత్రులపై కేసులు నమోదు చేయాలని ఈసీని కోరినట్లు చెప్పారు. కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని ప్రజలకు మర్రి శశిధర్ రెడ్డి పిలుపు ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm