హైదరాబాద్ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. శరన్నవరాత్రుల్లో కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరుకావడం విదితమే. అమ్మ వారికి కానుకలు కూడా భక్తులు భారీగానే సమర్పించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి రికార్డు స్థాయి ఆదాయం లభించింది. దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.6.77 కోట్లు, కానుకల రూపంలో వచ్చిన బంగారు నగలు 1.23 కిలోలు, వెండి వస్తువులు 27.81 కిలోలు, అన్నదాన హుండీ ఆదాయం రూ.10.32 లక్షలు లభించినట్టు లభించినట్టు ఆలయ అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm