ముంబై: మెట్రో పనుల కోసం ముంబైలో చెట్లను నరికివేసినందుకు ప్రభుత్వం అనేక విమర్శలు ఎదుర్కొంది. ఇది కాస్త సద్దుమణిగిందో లేదో బీజేపీకి మరో తలనొప్పి ఎదురైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలు విస్తృతస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు. కాగా అక్టోబర్ 17, గురువారం నాడు పూణెలో మోడీ బహిరంగ సభ ఉంది. పర్శురాం కాలేజ్ క్యాంపస్లో ఏర్పాటు చేస్తోన్న వేదికకు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే దీని కోసం క్యాంపస్లోని చెట్లను నరికివేశారని కాంగ్రెస్, ఎన్సీపీ సహా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం పర్యావరణాన్ని పాడు చేస్తున్నారని బీజేపీపై మాటల దాడికి దిగాయి. మోడీకి రాజకీయ ప్రయోజనాలే కానీ, దేశ ప్రయోజనాలు ఏమీ పట్టవని విమర్శించాయి.
అయితే దీనిపై కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జావడేకర్ స్పందించారు. చెట్లను నరికివేసిన ప్రాంతంలోనే మళ్లీ కొత్త మొక్కల్ని నాటుతామని అన్నారు. పర్యావరణంపై కాంగ్రెస్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తాము అధికారంలోకి వచ్చాక దేశంలో అడవుల సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ పెట్టామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 08:05PM