హైదరాబాద్ : జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఈ నెల 18న నిర్వహించాలని అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. అలాగే ఈ నెల 20న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు నిర్వహించాలని అధినేత నిర్ణయించారని పవన్ కల్యాణ్అ కార్యదర్శి హరిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పొలిట్ బ్యూరో సమావేశం, 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ సమావేశాలు హైదారాబాద్లోని ప్రశాసన్ నగర్ పార్టీ కార్యాలయంలో జరుగుతాయన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm