హైదరాబాద్: గత కొంతకాలంగా సిటీలోని ఇళ్లల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను మీర్పేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్ డీఎస్పీ సంప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. తాళాలు వేసి ఉన్న ఇళ్లను ముందుగానే పరిశీలించి, గస్తీ కాసిన దొంగలు వరుసగా చోరీలకు పాల్పడుతున్నారనీ, వారి కోసం పోలీసు బృందాలు విపరీతంగా గాలించాయని ఆయన తెలిపారు. ఎట్టకేలకు ఇవాళ వారిని మా పోలీసు బృందం చాకచక్యంగా పట్టుకొని, అరెస్టు చేశారు. వారి నుంచి 9 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm