కామారెడ్డి: జిల్లా కేంద్రంలో సిద్దిపేట ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నరేష్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించారు. బస్సు ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో పాటు సిరిసిల్ల రోడ్లో పలు వాహనాలను ఢీకొట్టాడు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm