న్యూడిల్లీ: అగ్రదేశాలతో పోటీ పడుతున్నామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వానికి షాకింగ్ న్యూస్ ఇచ్చింది గ్లోబల్ హంగర్ ఇండెక్స్. ప్రపంచంలో ఆకలితో అలమటిస్తున్న దేశాలకు సంబంధించి 2019కి గాను జీహెచ్ఐ జాబితాను విడుదల చేసింది. దేశంలో ఆకలితో అలమటించే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని ఈ జాబితా తేల్చింది. పలు అంశాలను ప్రామాణికంగా తీసుకొని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఈ లిస్ట్ను రూపొందించింది.
117 దేశాలతో కూడిన ఈ లిస్ట్లో భారత్.. పొరుగు దేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ల కంటే దిగువన ఉంది. 117 దేశాలలో భారత్ 102వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో పాకిస్తాన్ 94వ స్థానంలో ఉండగా.. బంగ్లాదేశ్ 88, నేపాల్ 73వ స్థానాల్లో ఉన్నాయి. గతేడాదితో పోలీస్తే భారత్ కేవలం ఒక స్థానం మాత్రమే మెరుగుపడింది. అయితే 2014లో 55వ స్థానంలో ఉండగా 2015లో 93వ స్థానానికి చేరింది. తాజాగా 102వ స్థానానికి చేరుకోవడం ఆందోళనను రేకెత్తిస్తోంది. అన్ని రంగాల్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న పాక్ సైతం 2019 ర్యాంకింగ్స్లో 94వ స్థానంలో నిలిచింది. గతేడాది 106వ స్థానంలో ఉన్న పాక్.. 12స్థానాలను మెరుగుపరుచుకోగలిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 16,2019 11:52PM