హైదరాబాద్: విద్యాసంస్థలకు సెలువులు పొడిగిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఎట్టిపరిస్థితిలోనూసెలవులను పొడిగించ వద్దని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. ఆర్టీసీ సమ్మెనేపధ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేయలేకపోతున్న ప్రభుత్వం ఇప్పటికే దసరా సెలవులను పొడిగించింది. సమ్మె మరింత ఉధృతం అవుతున్ననేపధ్యంలో సెలవులను పొడిగించాలన్న ఆలోచనే రావద్దని, విద్యార్దుల విలువవైన సమయం వృధా అవుతుందని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెలవుల పొడిగంపు ఉండదని విద్యాశాఖ వెంటనే ప్రకటన చేయాలని ఆయన డిమాండ్చేశారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల బస్సులను ప్రభుత్వం ప్రజా రవాణా కోసం వినియోగించవద్దని విద్యార్ధులు పాఠశాలలకు వెళ్లి రావడంలో భద్రత బాధ్యత విద్యాశాఖనే చేపట్టాలని ఆయన డిమాండ్చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm