హైదరాబాద్ : హైదరాబాద్ మాదాపూర్ లో సన్ మీడియా గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ లీడర్ షిప్ అవార్డ్స్ -2019 కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. హాస్పిటల్స్, స్పోర్ట్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్ తదితర విభాగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి మంత్రి ఈటల రాజేందర్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..శాస్త్ర సాంకేతికతను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలని, వినాశనానికి కాదని సూచించారు. పాశ్చాత్య కల్చర్ మోజులో పడి మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోవద్దన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm