రాంచీ: టీమిండియా టెస్టు ఓపెనర్గా అవతారమెత్తిన 'హిట్మ్యాన్' రోహిత్శర్మ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న ద్వైపాక్షిక టెస్టు సిరీస్లో బ్యాట్తో చెలరేగిపోతున్న రోహిత్ అనేక రికార్డులను తన పేరుపై రాసుకుంటున్నాడు. రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో నిన్న సెంచరీతో చెలరేగిన రోహిత్.. ఓ ద్వైపాక్షిక టెస్టు సిరీస్లో మూడు సెంచరీలు సాధించిన రెండో ఇండియన్గా రికార్డులకెక్కాడు. అలాగే, ఓ టెస్టు సిరీస్లో అత్యధిక సిక్సర్లు (19) కొట్టిన ఆటగాడిగానూ రోహిత్ మరో రికార్డు నెలకొల్పాడు. కాగా, నిన్నటి జోరును కొనసాగించిన రోహిత్ నేడు డబుల్ సెంచరీ (212) పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో రోహిత్కు ఇదే తొలి ద్విశతకం. ఫలితంగా వన్డేలు, టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా మరో ఘనత అందుకున్నాడు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్గేల్ ఆ ఘనత సాధించారు.
Mon Jan 19, 2015 06:51 pm