హైదరాబాద్: హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించి ఆర్టీసీ కార్మికులను చర్చలకు ఆహ్వానించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస, విపక్ష నేతల సమావేశం జరిగింది. అనంతరం నేతలంతా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా చేపట్టే నిరసన కార్యక్రమాల్లో అందరూ క్రియాశీలకంగా పాల్గొనాలని.. ఆర్టీసీని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm