పానాజీ: గోవాలో ఐరన్ మ్యాన్ ట్రయథ్లాన్ రేస్ ను నిర్వహించారు. పానాజీలోని మిరామర్ బీచ్ తీరంలో ఐరన్ మాన్ 70.3-రేస్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రన్నింగ్, సైక్లింగ్ తోపాటు మరెన్నో యాక్టివిటీస్ ను చేపట్టారు. దేశంలోనే ఇలాంటి కార్యక్రమం చేపట్టడం మొదటిసారి అని గోవా సీఎం ప్రమోద్ సావంత్ అన్నారు. 27కు పైగా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయని తెలిపారు. స్పోర్ట్స్ టూరిజంను మరింత ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తామన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm