హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పోలీస్ కళ్యాణ మండపంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరిగాయి. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యవసాయ , సహకార శాఖా మాత్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వైద్య శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm