హైదరాబాద్ : కార్మికుల సమ్మెపై ప్రభుత్వం దిగి రాకపోవడంపై ఆర్టీసీ జేఏసీ, వారికి మద్దతుగా నిలిచిన పార్టీలు మండిపడుతున్నాయి. కార్మికులతో చర్చలు జరపాలన్న హైకోర్టు సూచనను సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే కార్మికులు, పలు పార్టీలు తమ నిరసన కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో రేపు ప్రగతి భవన్ ను ముట్టడించనున్నారు. ఇందుకు సంబంధించిన వ్యూహంపై కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ నివాసంలో ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm