న్యూఢిల్లీ: కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవంపై నెలకొన్న సందేహాలు తొలగిపోయాయి. ఈ విషయమై పాక్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఫేస్బుక్ ద్వారా కీలక ప్రకటన చేశారు. కారిడార్ ప్రారంభోత్సవం నవంబర్ తొమ్మిదో తారీఖునే ఉంటుందని స్పష్టం చేశారు. కార్తార్పూర్ కారిడార్ నిర్మాణం పనులు చివరి అంకానికి చేరుకున్నాయి. నవంబర్ 9 నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోని సిక్కులందరి కోసం పాకిస్థాన్ ద్వారాలు త్వరలో తెరుచుకోనున్నాయి. అని ఇమ్రాన్ ఖాన్ ఫేస్ బుక్లో పోస్ట్ చేశారు.
అక్టోబర్ 10 పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యల అనంతరం ప్రారంభోత్సవంపై సందేహాలు కమ్ముకున్నాయి. ప్రారంభోత్సవానికి తేదీ ఖారారు చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు నవంబర్ 9 నుంచీ కర్తార్పూర్ పర్యటనకు భారత యాత్రికులను అనుమతిస్తామని ఈ ప్రాజెక్టు సంబంధించి ఓ అధికారి ప్రకటించారు. ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనల కారణంగా కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవ తేదీపై సందేహాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఇమ్రాన్ ఖాన్ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వీటికి తెరదించారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Oct 20,2019 05:53PM