హైదరాబాద్ : మరోసారి మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఈ ఘటన జరిగింది. అయితే, పెచ్చులూడిపడ్డ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై మెట్రో అధికారులు స్పందించాల్సి ఉంది. కాగా, అమీర్ పేట్ మెట్రో స్టేషన్ పైనుంచి పెచ్చులూడిపడ్డ ఘటనలో మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి చెందింది.
Mon Jan 19, 2015 06:51 pm