న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికలను ఆర్టికల్ 370 రద్దు ఏమాత్రం ప్రభావితం చేయలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు కుమారి షెల్జా అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను పక్కదారి పట్టించడానికి బీజేపీ డైవర్టింగ్ గేమ్ ఆడుతోందని, అయితే ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలహీనపడిపోయిందని, ప్రజలు తమకు అనుకూలంగానే తీర్పు ఇస్తారని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. 'బీజేపీ ఆడే డైవర్టింగ్ గేమ్లను ప్రజలు గమనిస్తున్నారు. వారు ఆర్టికల్ 370, జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్ఆర్సీ) గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ, బీజేపీ తమ సొంత కథనాలను ప్రచారం చేయలేకపోతోంది. బీజేపీ నేతలు చాలా ప్రయత్నిస్తున్నారు. కానీ, హర్యానాలో చాలా సమస్యలు ఉండడం వల్ల అది సాధ్యమవడం లేదు. మేం ఆ సమస్యల్ని లేవనెత్తుతున్నాం. ప్రజలు స్పందిస్తున్నారు' అని షెల్జా అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm