న్యూఢిల్లీ: దీపావళిని పురస్కరించుకుని ఈ-కామర్స్ ప్రముఖ సంస్థ అమెజాన్ ఇండియా ఫెస్టివల్ సేల్తో ముందుకొస్తోంది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ పేరుతో 21వ తేదీ నుంచి 25 వరకు ఐదు రోజులపాటు ఆఫర్లకు తెరతీసింది. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ అర్ధరాత్రి నుంచే ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. వన్ప్లస్ 7టి, శాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్, వివో యూ10 తదితర స్మార్ట్ఫోన్లపై రాయితీలు, డీల్స్ ప్రకటించింది. యాక్సెస్, సిటీ బ్యాంక్లతో ఒప్పందం కుదుర్చుకున్న అమెజాన్.. ఆయా బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి 10 శాతం తక్షణ రాయితీ ఇవ్వనుంది. అలాగే, అన్ని రుపే కార్డులకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది. అప్లయెన్సెస్, టీవీలపై 60 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించగా, హోం, కిచెన్ ఉత్పత్తులపై 70 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్టు అమెజాన్ తెలిపింది. డెబిట్, క్రెడిట్ కార్డులు, బజాజ్ ఫిన్సెర్వ్ కార్డులపై నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్ ఉంది. అలాగే, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుపై అపరిమిత రివార్డు పాయింట్లు ఇవ్వనున్నట్టు తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm