హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలుకై పోరాటం సాగించాలని జనసేన నిర్ణయించింది. ఆదివారం జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ నేతలు చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో ఈనెల 3వ తేదీన ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. సీపీఎస్ రద్దు హామీని సీఎం జగన్ విస్మరించారని జనసేన తన ప్రకటనలో విమర్శించింది. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాజకీయ కక్షలతో అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదంది. తాగుబోతులను పెంచేలా ప్రభుత్వ మద్య విధానం ఉందని జనసేన ఆరోపించింది.
Mon Jan 19, 2015 06:51 pm