చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ భారత జట్టులో స్థానం దక్కించుకుంటానని టీమ్ఇండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ధీమా వ్యక్తం చేశాడు. పరిస్థితులను అర్థం చేసుకొని ఫినిషర్గా మ్యాచ్ను ముగిస్తానని తెలిపాడు. 'టీ20 ప్రపంచకప్కు ఏడాది సమయం ఉంది. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణించి టీమ్ఇండియాలో చోటు సంపాదిస్తా. ఎందుకంటే కఠిన పరిస్థితులను అర్థం చేసుకొని మ్యాచ్ను ముగించే మంచి ఫినిషర్ కోసం భారత్ ఎదురుచూస్తుంది. నేను ఆ స్థానానికి సరిపోతానని భావిస్తున్నా. ఇటీవల జరిగిన ప్రపంచకప్లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను. దీంతో ప్రస్తుత భారత జట్టులో నాకు చోటు దక్కలేదు. ధోనీ ఎన్నో ఏళ్లుగా గొప్ప ఫినిషర్గా సేవలు అందించాడు. అతడి స్థానాన్ని నేను భర్తీ చేయగలను. కోల్కతా నైట్ రైడర్స్, తమిళనాడు జట్లకు ఆడిన గొప్ప ఇన్నింగ్స్లను టీమ్ఇండియాకు కూడా ఆడగలనని నమ్ముతున్నా. టీ20 ప్రపంచకప్లో భారత జెర్సీ ధరించాలని ఉంది' అని దినేశ్ కార్తీక్ అన్నాడు.
Mon Jan 19, 2015 06:51 pm