అనంతపురం: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నలుగురు పిల్లలకు విషమిచ్చిన తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే వారిని హిందూపురం ఆస్పత్రికి తరలించారు. మద్యం తాగి భర్త కొట్టడంతో మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పెనుకొండ మండలం తిమ్మాపురంలో ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో వారికి వైద్యం అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm