హైదరాబాద్ : పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడుల్లో 6 నుంచి 10 మంది పాక్ సైనికులు మృతి ఉంటారని భారత సైనికాధిపతి బిపిన్ రావత్ తెలిపారు. ఉగ్రవాదులు కూడా దాదాపు అదే స్థాయిలో హతమై ఉంటారని చెప్పారు. ఈ మేరకు రావత్ ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. నీలం వ్యాలీలో లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు చెందిన నాలుగు స్థావరాలు లక్ష్యంగా భారత్ దాడులు చేసింది. అందులో మూడు స్థావరాలు పూర్తిగా ధ్వంసం కాగా, మరొకటి స్వల్పంగా ధ్వంసమైంది. ముందుగా జురా, అత్ముకమ్, కుండల్సాహి స్థావరాల్లో ఎక్కువ సంఖ్యలో ఉగ్రవాదులు ఉన్నారని విశ్వసనీయ సమాచారం అందింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల తంగ్ధర్ సెక్టార్లో కాల్పుల ద్వారా దేశంలో చొరబడేందుకు ప్రయత్నించగా అడ్డుకునేందుకే సైన్యం ఈ దాడులు చేసింది అని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్కు ఫోన్ చేసి తాంగ్ధర్ సెక్టార్లో ప్రస్తుత పరిణామాల గురించి అడిగి తెలుసుకున్నారని సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm