వుఝెన్: చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ వచ్చే ఏడాది పదికి తక్కువ కాకుండా 5జీ ఫోన్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో లీ జున్ వెల్లడించారు. 2020లో 10కిపైగా 5జీ ఫోన్లు విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. మొబైల్ తయారీ కంపెనీలన్నీ ప్రస్తుతం ఆవేదనలో ఉన్నాయని, వచ్చే ఏడాది 4జీ ఫోన్లు అమ్ముడుపోవన్న భయం వాటిలో కనిపిస్తోందని అన్నారు. చైనాలోని తూర్పు పట్టణమైన వుఝన్లో జరిగిన వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ లీ జున్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm