హైదరాబాద్: పంజాగుట్టకు చెందిన రియాసత్ అలీ హత్యకేసులో ముగ్గుర్ని అరెస్టు చేసినట్లు సీపీ అంజనీకుమార్ విలేకరుల సమావేశంలో వివరించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారనీ, వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రియాసత్ అలీ హత్యకేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్ రెహ్మాన్ అని సీపీ తెలిపారు. గతంలో అన్వర్ అనే వ్యక్తి హత్య కేసులో రియాసత్ ప్రధాన నిందితుడని సీపీ వివరించారు. కాగా, రియాసత్ అలీ గత 9 రోజుల క్రితం బెయిల్ పై విడుదలయినట్లు ఆయన వివరించారు. అన్వర్ హత్యకు ప్రతీకారంగానే రియాసత్ అలీపై అతని స్నేహితులు దాడి చేసినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల నుంచి 5 కత్తులు, ఓ కారు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm