హైదరాబాద్: తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 16వ రోజుకి చేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించింది. ఈ నెల 21న అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నాలో పాల్గొంటారు. ఈ నెల 22న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లకు తమ పొట్టకొట్టవద్దంటూ విజ్ఞప్తులు చేస్తూ నిరసన ప్రదర్శనలు ఉంటాయని జేఏసీ వెల్లడించింది. ఈ నెల 23న ప్రజాప్రతినిధులను కలిసి సమ్మెకు మద్దతు కోరాలని నిర్ణయించారు.
Mon Jan 19, 2015 06:51 pm