హుజూర్నగర్: హుజూర్నగర్ ఉప ఎన్నికకు ఈసీ(ఎలక్షన్ కమిషన్) సర్వం సిద్దం చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికకు సంబంధించి ఈసీ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. సూర్యపేట కలెక్టర్ అమయ్కుమార్, ఎస్పీ భాస్కరన్ ఈవీఎంల పంపిణీని పరిశీలించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సూర్యపేట కలెక్టర్ అమయ్కుమార్ తెలిపారు. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 1500 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును పరిశీలిస్తామనీ, ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు వస్తే తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందనీ, ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విన్నవించారు. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల 842 మంది ఓటర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm