సూర్యాపేట: హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నిక బరిలో 28 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తం 302 పోలింగ్ కేంద్రాలు.. 1708 ఈవీఎంలను ఏర్పాలు చేశారు. 1700 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉండగా.. 2500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 2,36,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 79 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించిన అధికారులు.. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm