ముంబై: మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలో 288 స్థానాల్లో, హరియాణాలో 90 స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా మొత్తం 51 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని సతారా, బిహార్లోని సమస్తిపూర్ లోక్సభ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 24వ తేదీన జరుగనున్నాయి. పటిష్టమైన భద్రత మధ్య ఈ ఎన్నికలను ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా అధికారులు నిర్వహిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm