ఖైరతాబాద్: రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...నల్గొండ జిల్లా బొట్టుగూడకు చెందిన పోతపాక సాయిరాం (18) ఖైరతాబాద్లోని నెహ్రూనగర్లో నివాసం ఉన్న మేనమామ ఇంటికి తల్లితో కలిసి వచ్చాడు. మూత్ర విసర్జనకు ఖైరతాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల మీదుగా వెళ్లగా గుర్తుతెలియని రైలుఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక మాజీ కార్పొరేటర్ ఎస్కే షరీఫ్ పోలీసులకు సమాచారం అందించగా, ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm