హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసేందుకు వెళ్తున్న జగన్కు ఇప్పటి వరకు ఆయన అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. దీంతో షాతో భేటీపై సందిగ్ధం నెలకొంది. కాగా, రేపు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో భేటీ అనంతరం జగన్ తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఈ ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం 9:50 గంటలకు జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10:05కి విమానంలో ఢిల్లీ బయల్దేరతారు. మధ్యాహ్నం 12.20కి ఢిల్లీ చేరుకుని నేరుగా తన అధికార నివాసమైన 1-జన్పథ్కు చేరుకుంటారు.
Mon Jan 19, 2015 06:51 pm