విజయవాడ: డివైడర్ను ఢీకొని ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడటంతో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డు పడవల జంక్షన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు.
Mon Jan 19, 2015 06:51 pm