హైదరాబాద్: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోకు చెన్నై కార్పొరేషన్ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. చెన్నైలో ఇటీవల డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతుండడంతో స్పందించిన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అపరిశుభ్ర పరిసరాలను గుర్తించేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతున్నారు. అపరిశుభ్రంగా కనిపించిన సంస్థలు, కార్యాలయాలకు కార్పొరేషన్ అధికారులు ఎక్కడికక్కడ జరిమానాలు విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని చేట్పెట్ ఎంసీ నికల్సన్ రోడ్డులోని ఓ భవనంలో అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న జొమాటో బ్యాగులను గుర్తించిన అధికారులు ఆ సంస్థకు లక్ష రూపాయల జరిమానా విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm