గురుగ్రామ్: దేశంలోని పలుచోట్ల ఎన్నికలు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాలలోను, హర్యానాలోని 90 సీట్లకు, వాటితోపాటు మరో 51 చోట్ల ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి తరలివస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా హర్యానాలోని గురుగ్రామ్లోని బూత్ నంబర్ 286లో ఈవీఎంలు మోరాయించడంతో ఓటింగ్ నిలిచిపోయింది. దీంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm