అమరావతి: నేషనల్ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసిన గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో కనీస సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదిత పథకాలన్నిటినీ సకాలంలో పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయంలో నేషనల్ రూర్బన్ మిషన్ పై సిఎస్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఎంపవర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, గిరిజన ప్రాంతాలను ఆర్థికంగా, సామాజికంగా పూర్తిగా అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చేందుకు అవసరమైన పూర్తిస్థాయి కనీస మౌళిక సదుపాయాలను కల్పించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ రూర్బన్ మిషన్ ను అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. కావున ఈ పథకం కింద ఎంపిక చేసిన గ్రామాలు, గిరిజన గ్రామాల్లో ప్రతిపాదించిన పనులన్నీ శరవేగంగా పూర్తి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm