విజయవాడ: తాడేపల్లి పంచాయతీ రాజ్ భవన్ కార్యాలయం ఎదుట ప్రకాశం, గుంటూరు జిల్లాల ఏఎన్ఎమ్ నర్సులు ఆందోళనకు దిగారు. మహిళల పోస్టుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మెరిట్ లిస్టులో ఉన్నా నూతన రిజిస్ట్రేషన్ నెపంతో తమ్మల్ని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు మంగళవారం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో నర్సులు ఆందోళనను విరమించారు.
Mon Jan 19, 2015 06:51 pm