హైదరాబాద్: బండవెల్కిచర్ల గ్రామంలో మిషన్ భగీరథ పనులు అసంపూర్తిగా ఉండటంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజుల క్రితం పైపులు వేయడానికి గుంతలు తవ్వించారు. పైపులు వేసిన అనంతరం గుంతలను మాత్రం పూడ్చి వేయడం మరిచారు. గుంతలను త్వరగా పూడ్చి వేయించాలని మిషన్ భగీరథ సిబ్బందికి పలు మార్లు తెలియపరిచినా పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. అధికారులు ఇకనైనా స్పందిచాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm