హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులు ధూంధాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ... విలీనంపై వెనక్కి తగ్గామని ఎక్కడా చెప్పలేదన్నారు. ఆర్టీసీ విలీనం అవసరం లేదని చెప్పినట్టుగా నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్టబద్ధత లేదన్నారు. చర్చల కోసం ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు. కంటి తుడుపు కమిటీలతో కాలయాపనేనని అశ్వత్థామరెడ్డి పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm