హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదాన్ని నింపిన పర్యాటక బోటు 'రాయల్ వశిష్ఠ' ఒడ్డుకు చేరిన విషయం తెలిసిందే. అయితే, ఈ బోటు ప్రమాదంలో వెలికితీసిన మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ఇంకా ఐదు మృతదేహాలు ఉన్నాయి. మంచిర్యాల వాసి రమ్యశ్రీ మృతదేహం ఇంకా గుర్తించాల్సి ఉంది. రాజమహేంద్రవరం ఆస్పత్రిలో సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. మృతదేహాల శాంపిల్స్ను డీఎన్ఏ పరీక్షల కోసం హైదరాబాద్ తరలించనున్నట్టు వైద్యులు వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm