చెన్నై : హెల్మెట్ ధరించకుండా స్కూటర్ నడిపిన పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి తప్పకుండా జరిమానా చెల్లించాల్సిందేనని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేదీ పేర్కొన్నారు. పుదుచ్చేరిలోని కామరాజనగర్ ఉప ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో నారాయణస్వామి హెల్మెట్ ధరించకుండా హోండా స్కూటర్ నడిపారు. ఆ ఫొటో ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. ఈ నేపథ్యంలో మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లఘించి హెల్మెట్ ధరించకుండా స్కూటర్ నడిపిన ముఖ్యమంత్రి నారాయణస్వామిపై కేసు నమోదు చేసి, జరిమానా వసూలు చేయాలంటూ గవర్నర్ కిరణ్బేదీ ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆగ్రహించిన ముఖ్య మంత్రి నారాయణస్వామి గతంలో హెల్మెట్ ధరించకుండా ఓ స్కూటర్ వెనుక సీటులో ప్రయాణిస్తున్న కిరణ్బేదీ ఫొటోను సామాజిక ప్రసార మాధ్యమాల్లో పెట్టి, ఒకరికి సలహా చెప్పేటప్పుడు తాను దానిని పాటించానో లేదో గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఆమెకు ఉందని కౌంటర్ ఇచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm