బెర్హంపూర్ : ఒడిశా రాష్ట్రంలోని బెర్హంపూర్ నగరంలో ఓ ప్రేమ జంట చేసుకున్న వినూత్న వివాహం టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. బెర్హంపూర్ నగరానికి చెందిన విప్లవ్ కుమార్, అనితలు మన భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి వివాహమాడి అతిధులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీంతోపాటు వారి పెళ్లి సందర్భంగా వధూవరులైన విప్లవ్ కుమార్, అనితలతోపాటు పెళ్లికి వచ్చి అతిధులు కూడా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రతి ఒక్కరూ వరకట్నం లేకుండా, హంగూ ఆర్భాటం లేకుండా నిరాడంబరంగా పర్యావరణహితంగా వివాహం చేసుకోవాలి. పెళ్లి సందర్భంగా బాణసంచా కాల్చవద్దు. మ్యూజిక్ కూడా పెట్టవద్దు. ప్రతీ ఒక్కరూ రక్తదానం చేయండి అంటూ విప్లవ్ కుమార్ వ్యాఖ్యానించారు.వరుడు విప్లవ్ కుమార్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగి కాగా వధువు అనిత నర్సుగా పనిచేస్తున్నారు. వితంతువులు కూడా పాల్గొన్న తమ వినూత్న పెళ్లితో తామిద్దరం కొత్త జీవితం ప్రారంభించడం సంతోషాన్నిచ్చిందని విప్లవ్ కుమార్, అనితలు వ్యాఖ్యానించారు.
Mon Jan 19, 2015 06:51 pm