గోదావరిఖని: బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం తీపి కబురు చెప్పింది. ఈ దీపావళికి బోనస్ను చెల్లించనున్నట్టు ప్రకటించింది. సింగరేణిలో దీపావళికి ముందు కార్మికులకు బోనస్ చెల్లిస్తుంటారు. గతేడాది కార్మికులకు రూ.60,500 చొప్పున చెల్లించగా.. ఈసారి 64,700 చొప్పున బోనస్గా ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. ప్రతిభ ఆధారిత ప్రయోజనం (పీఎల్ఆర్- బోనస్)కింద ఈ బోనస్ మొత్తాన్ని ఈ నెల 25న కార్మికులకు చెల్లించనున్నట్టు యాజమాన్యం స్పష్టంచేసింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 48వేల మందికి పైగా కార్మికులు బోనస్ అందుకోనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm