హైదరాబాద్: బీఎస్ఎన్ఎల్ లేదా ఎంటీఎన్ఎల్ను మూసివేయడం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన ఇవాళ ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో తెలిపారు. బీఎస్ఎన్ఎల్లో పెట్టుబడులను ఉపసంహరించడం లేదన్నారు. థార్డ్ పార్టీకి కూడా ఆ సంస్థలను అప్పగించడం లేదని తెలిపారు. అయితే రెండు సంస్థలను విలీనం చేసే ప్రణాళికకు ఆమోదం తెలిపినట్లు మంత్రి చెప్పారు. రబీ పంటలపై కనీస మద్దతు ధరను పెంచాలని క్యాబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. గోధుమ, బార్లీపై ఎంఎస్పీని 85 రూపాయాలు పెంచినట్లు మంత్రి చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm