హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై కమిటీ వేసినందుకు సీఎం కేసీఆర్కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సమస్య పరిష్కరిస్తే కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తానని చెప్పారు. అధికారపార్టీలో ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ ఉండదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవి కాబట్టే ప్రగతిభవన్ ముట్టడిలో పాల్గొన్నానని తెలిపారు. కాంగ్రెస్లో టీఆర్ఎస్ నేత కేశవరావు, మాజీ డీఎస్ పులిలా బతికారని, కేకే పిల్లిలా బతుకుతుంటే..డీఎస్ కనుమరుగయ్యాడని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్లో ఎవరైనా పులిలా బతికేయొచ్చని జగ్గారెడ్డి అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm