నిర్మల్: దీపావళి పర్వ దినాన ఎవరైనా అసాంఘీక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సి. శశిధర్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. టపాసులు కూడా పరిమితంగానే కల్చాలనీ, గొప్పలకు పోయి పర్యావరణాన్ని దెబ్బదీయకూడదని ఆయన జిల్లా ప్రజలకు సూచించారు. దీపావళి పర్వదినాన పేకాట గానీ, ఇతర వ్యసనాల జోలికి వెళ్లకూడదని ఆయన తెలిపారు. అలాంటి సమాచారం గనుక తమకు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా ప్రకటనలో తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm