హైదరాబాద్: ఢిల్లీ ప్రజలకు ఇదో శుభవార్త. ఆ నగరానికి చెందిన సుమారు 40 లక్షల మందికి సంతోషాన్నిచ్చే విషయాన్ని కేంద్రం ప్రకటించింది. గుర్తింపులేని కాలనీల్లో నివసించే వారికి యాజమాన్య హక్కులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ప్రకటన చేశారు. ఢిల్లీలో ఇవాళ కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలను ఆయన ప్రకటించారు. ఓ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా నగరంలో ఉన్న సుమారు 1797 గుర్తింపులేని కాలనీలను క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనను అమలు చేసేందుకు పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లును తీసుకురానున్నట్లు కేంద్ర గృహనిర్మాణ మంత్రి హరిదీప్ సింగ్ పురి చెప్పారు. కేంద్ర తీసుకున్న నిర్ణయాన్ని మరో మంత్రి హర్ష్ వర్ధన్ స్వాగతించారు. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 200 గజాలు ఉన్న ఇంటి స్థలానికి ఒక శాతం పన్ను వసూల్ చేయనున్నట్లు భావిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm